కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
చంద్రబాబు, లోకేష్ ఏపీకి పట్టిన భయంకర వైరస్లు
26 Apr 2021 2:06 PM
మంత్రి కొడాలి నాని
విజయవాడ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత లేదు
విజయవాడ: చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఏపీకి పట్టిన కరోనా కంటే భయంకర వైరస్ లు అని మంత్రి కొడాలి నాని చురకలు అంటించారు. వార్డు మెంబరుగా కూడా గెలవని లోకేష్ ట్వీట్లకు ఏం సమాధానం చెబుతామని మంత్రి కొడాలి నాని సెటైర్ వేశారు. ఆక్సిజన్, వ్యాక్సిన్, రెమిడెసివర్ అంశాలను కేంద్రం పర్యవేక్షిస్తోందని..వైజాగ్ లో 170 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంటే 100 మెట్రిక్ టన్నులు మనకు ఇచ్చి మిగిలింది మహారాష్ట్ర కు ఇవ్వమన్నారని తెలిపారు. ఏపీని..ఒరిస్సా నుంచి తెచ్చుకోమంటున్నారని.. ఇదే దేశం అంతా ఉన్న సమస్య అని పేర్కొన్నారు. సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. విజయవాడ హాస్పిటల్ లో ఆక్సిజన్ లేదు అన్న బుద్ధిలేని వాడు ఎవరు? అని ఫైర్ అయ్యారు. విజయవాడ హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత లేదని.. తప్పుడు వార్తలు చూస్తే ప్రజలు భయాందోళనకు గురవ్వరా?అని తెలిపారు.