విజయవాడ: రైతులకు రెట్టింపు ఆదాయం..నాణ్యమైన ఉత్పత్తులే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కన్నబాబు పేర్కొనారు. రైతాంగానికి మేలు చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్నతాధికారుల కమిటీతో మంత్రి కన్నబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయ పాలసీ తీసుకొచ్చే అంశంపై చర్చించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంచాలని సూచించారు. సీఎం వైయస్ జగన్తో చర్చించి త్వరలో ఆర్గానిక్ పాలసీ తీసుకొస్తామని మంత్రి చెప్పారు.