తండ్రి స్క్రీన్ ప్లేలో లోకేశ్ యాక్ష‌న్‌

మంత్రి కన్నబాబు
 

తాడేప‌ల్లి: తనయుడు లోకేశ్‌ ఎలా అల్లరి చేయాలో అని తండ్రి చంద్రబాబు నాయుడు శిక్షణ ఇస్తున్నట్లుందని మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ఏడు నెలల కిందట జరిగిన సంఘటనలో ప్రభుత్వం ఎలా వ్యవహరించిదో అందరికీ తెలుసని పేర్కొన్నారు. వాళ్లకి ప్రజలపై ప్రేమ లేదు.. తండ్రి స్క్రీన్ ప్లేలో లోకేశ్‌ నటిస్తున్నాడని కన్నబాబు విమర్శించారు.మహిళల భద్రతలో ఎవరితోనో చెప్పించుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. టీడీపీలో కూడా లోకేశ్‌ నాయకత్వాన్ని అంగీకరించడం లేదని చెప్పారు. అందుకే ఇలాంటి డ్రామాలు అని పేర్కొన్నారు. జేసీ దివాకర్ రెడ్డి బస్సు ప్రమాదం జరిగితే తమ నాయకుడు వెళితే కేసులు పెట్టింది ఏ ప్రభుత్వం..? రన్ వేపై నిలిపివేసి దుర్మార్గంగా వ్యవహరించింది ఎవరు..? ఏం తప్పు చేశారని ఆ రోజు కాపులు కంచాలు కొట్టారని వేల మందిపై కేసులు పెట్టారు..? అని నిలదీశారు. 

ప్రజాస్వామ్య పద్ధతిన జరుగుతున్న పరిపాలన వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు. రాజకీయంగా లోకేశ్‌ని టీడీపీలో యాక్సెప్టెన్సీ కోసం ఈ డ్రామాలన్నీ అని మంత్రి కన్నబాబు తెలిపారు. అంతకుముందు ఆయన వ్యవసాయ శాఖ అభివృద్ధిపై ఆయన మాటలు ఇలా.. ‘గ్రామ స్థాయి వరకు బ్యాంకింగ్ వ్యవస్థను డిజిటలైజ్ చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు.  దానికి కావాల్సిన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. కరోనా నేపథ్యంలో రాష్ట్రం పురోగతి సాధించడానికి బ్యాంకర్స్ సహకారం బాగుందని సీఎం చెప్పారు. ఇతర రాష్ట్రాలకంటే సమర్థంగా పని చేసిందని జీడీపీ తెలుపుతోంది. 10.49 శాతం పంటరుణాలు అధికంగా ఇచ్చాం. కౌలు రైతులకు రుణాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక విధానం తేవాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి రుణ పరపతి కల్పించాలని సీఎం కోరారు. 9,160 ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాన్డెంట్స్ నియామకం చేయాలని సీఎం కోరారని, ఇప్పటికే 6 వేల మందిని నియమించాం. ఆర్బీకేలు బ్యాంకింగ్ సేవల అనుసంధానం పూర్తయితే సంపూర్ణమైన డిజిటలైజ్ జరుగుతుంది.

‘హౌసింగ్ కోసం కూడా రూ.35 వేలు చొప్పున తక్కువ వడ్డీకి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈలకు పూర్తిగా సహకరించేందుకు బ్యాంకులు ముందుకురావాలని సీఎం కోరారు. అత్యధిక ఉద్యోగ కల్పన ఈ రంగమే ఇస్తుందని, దాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక కార్యకలాపాలు క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లేందుకు మన పథకాలు సహకరించాయి. సీఎం యాప్‌ని సమర్థవంతంగా వినియోగించి రైతుకు ధరలు అందే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు’ అని మంత్రి కన్నబాబు వివరించారు.

తాజా వీడియోలు

Back to Top