వేగంగా ఇళ్ల నిర్మాణాలు

మంత్రి జోగి ర‌మేష్‌
 

అమ‌రావ‌తి:  రాష్ట్రంలో వేగంగా ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయ‌ని, ఇళ్ల‌కు 20 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా అందిస్తున్నామ‌ని మంత్రి జోగి ర‌మేష్ తెలిపారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో పేదల ఇళ్ల నిర్మాణం గురించి మంత్రి జోగిరమేష్ స‌మాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఐదులక్షల ఎనభై మూడు గృహాలు పూర్తి కాబోయే దశలో ఉన్నాయి, 7లక్షల గృహాలు చురుకైన నిర్మాణ దశలో ఉన్నాయి.
లబ్దిదారులకు, సరఫరాదారులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాము. ప్రభుత్వం 20 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా అందిస్తోంది. సిమెంట్, స్టీలు మార్కెట్ ధరకంటే తక్కువధరకు అందిస్తున్నాం. డోర్ ఫ్రేమ్ లు, విండో ఫ్రేమ్‌ లు, ఎలక్ట్రికల్ ఐటమ్స్, డోర్ షెటర్స్ భవన నిర్మాణ సామాగ్రి మార్కెట్ ధరకంటే తక్కువగానే ప్రతి ఇంటికీ ఇస్తున్నాం. ప్రతి ఇంటికీ యూనిట్ కాస్ట్ లక్షా ఎనభై వేలతో పాటు 35వేల రుణాన్ని 3 శాతం వడ్డీరేటుతో బ్యాంకుల నుంచి ప్రతి లబ్దిదారుడుకీ అందిస్తున్నాం. 
మిగిలిన వడ్డీ ప్రభుత్వమే భరిస్తోంది. లబ్దిదారులు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు 15వేలు ముందగానే వాళ్లకి అడ్వాన్స్ ఇవ్వడం జరుగతోంది. లబ్దిదారులు 10 నుంచి 20 మంది గ్రూపు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించాం. 
నిర్మాణం వేగంగా జరిపేందుకు, వారిని సమన్వయం చేసుకునేందుకు ఆ గ్రూప్ నుండే ఒక అధ్యక్షుడిని ఎంపిక చేసుకోమంటున్నాం.  ప్రధాన తాపీ మేస్త్రీ, కాంట్రాక్టర్లతో లబ్దిదారులను ట్యాగ్ చేస్తున్నాం. వెనువెంటనే వారికి డబ్బులు చెల్లిస్తున్నామ‌ని మంత్రి జోగి ర‌మేష్ తెలిపారు.

Back to Top