యనమలను మించిన సైకో, రాక్షసుడు మరొకరు లేరు

ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్‌

తుని: యనమల రామకృష్ణుడిని మించిన సైకో, రాక్షసుడు మరొకరు ఉండరని ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.  వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైలు దగ్ధం ఘటనలో కాపులతో సహా ఎస్సీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు ఇలా అందరిపై రకరకాలుగా కేసులు పెట్టి విపరీతంగా వేధించారని, తునిలో యనమల దాష్టీకానికి సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. టీడీపీ హయాంలో ఒకే నెలలో 130 అట్రాసిటీ కేసులు తుని నియోజకవర్గంలో నమోదైతే సాక్షాత్తు హైకోర్టు జడ్జి ఆశ్చర్యం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. ఒకే నియోజకవర్గం నుంచి ఇన్ని కేసులు ఎందుకు వస్తాయని ఆరోజున జిల్లా ఎస్పీకి నోటీసులు ఇచ్చారని గుర్తుచేశారు.  

Back to Top