బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
యనమలను మించిన సైకో, రాక్షసుడు మరొకరు లేరు
27 Dec 2022 4:38 PM
ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్
తుని: యనమల రామకృష్ణుడిని మించిన సైకో, రాక్షసుడు మరొకరు ఉండరని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైలు దగ్ధం ఘటనలో కాపులతో సహా ఎస్సీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు ఇలా అందరిపై రకరకాలుగా కేసులు పెట్టి విపరీతంగా వేధించారని, తునిలో యనమల దాష్టీకానికి సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. టీడీపీ హయాంలో ఒకే నెలలో 130 అట్రాసిటీ కేసులు తుని నియోజకవర్గంలో నమోదైతే సాక్షాత్తు హైకోర్టు జడ్జి ఆశ్చర్యం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. ఒకే నియోజకవర్గం నుంచి ఇన్ని కేసులు ఎందుకు వస్తాయని ఆరోజున జిల్లా ఎస్పీకి నోటీసులు ఇచ్చారని గుర్తుచేశారు.