కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనలపై చర్చిద్దామా?
18 Mar 2023 10:13 AM
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
అమరావతి: చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనలపై చర్చిద్దామా..? అని టీడీపీ నేతలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సవాలు విసిరారు. సభను పక్కదారి పట్టించేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. శనివారం ఉదయం టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవడంతో మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించారని అన్నారు. విభజన వల్ల పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చించారని తెలిపారు. పోలవరం నిధులపై ప్రధానితో సీఎం చర్చించారని పేర్కొన్నారు. సభలో టీడీపీ సభ్యులు అనవసర రాద్దాంతం చేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో పోలవరంలో జరిగిన తప్పులపై చర్చిద్దామా?. చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు, పెట్టిన బకాయిలపై చర్చిద్దామా?’’ అంటూ మంత్రి బుగ్గన సవాల్ విసిరారు.