మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎల్లో మీడియా దుష్ప్రచారం
21 Sep 2022 3:19 PM
అసెంబ్లీలో చెప్పిన లెక్కలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
శాసనసభను ఎల్లో మీడియా అవమానపరుస్తోంది
రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
అసెంబ్లీ: క్రిసిల్ రేటింగ్ పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని, రాష్ట్రానికి ఎటువంటి సహాయం అందకూడదని టీడీపీ కుట్ర పన్నుతోందని రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. ‘‘ఇతర రాష్ట్రాలతో పోలీస్తే ఏపీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. చంద్రబాబు అప్పులు చేస్తే గొప్ప అన్నట్లు ప్రచారం. ఈ ప్రభుత్వం అప్పు చేస్తే తప్పంటూ దుష్ప్రచారం చేస్తోంది. 2019 మార్చి నాటికి రూ.40,172 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉంటే ప్రస్తుతం రూ.21,673 కోట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. చంద్రబాబు హయాంలోని 20 వేల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పు చాలా తక్కువ. గత ప్రభుత్వం కంటే తక్కువ అప్పులే చేశాం. ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ప్రగతి సాధించాం. కోవిడ్ సంక్షోభంలోనూ ఏపీలో స్థూల ఉత్పత్తి పెరిగింది. శాసనసభను ఎల్లో మీడియా అవమానపరుస్తోంది. అసెంబ్లీలో చెప్పిన లెక్కలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.