ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

శాసనమండలి కొనసాగించాలని అసెంబ్లీలో తీర్మానం 

అసెంబ్లీ: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసన మండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాసన మండలి కొనసాగించాలనే తీర్మానాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మండలి రద్దు నిర్ణయం తరువాత సందిగ్ధత నెలకొందని, సందిగ్ధతను తొలగించేందుకే మండలి కొనసాగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి బుగ్గన తెలిపారు. శాసనమండలి రద్దు ఉపసంహరణ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది.
 

Back to Top