ప్రకాశం: తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల విజయం హర్షణీయమని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఎస్ఈసీని అడ్డుపెట్టుకొని చంద్రబాబు చేసిన కుట్రను ప్రజలు భగ్నం చేశారన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనతో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. అందుకే వైయస్ఆర్ సీపీ మద్దతుదారులకు ఓట్లేసి గెలిపించారన్నారు. మిగిలిన మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో కూడా వైయస్ఆర్ సీపీ మద్దతుదారులు భారీ విజయం సాధిస్తారన్నారు.