అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
‘విశాఖ ఉక్కు’ను కాపాడుకుంటాం
08 Feb 2021 10:58 AM
రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రధాని నిర్ణయం
మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అమర్నాథ్, నాగిరెడ్డి, ఎంపీ ఎంవీవీ
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేంత వరకు పోరాడుతామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కేంద్రం తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విశాఖ బాలచెరువు రోడ్ వద్ద అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాల నేతలు నిరసన సభ చేపట్టారు. నిరసన సభకు వైయస్ఆర్ సీపీ సంఘీభావం తెలిపింది. ఈ మేరకు మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైయస్ఆర్ సీపీ వ్యతిరేకిస్తుందన్నారు. దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రధాని నిర్ణయం ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని, ప్లాంట్ను కాపాడుకునేంత వరకు పోరాడుతామన్నారు.