పొత్తులు లేకుండా టీడీపీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌గ‌ల‌దా?

శాసన మండలిలో టీడీపీకి మంత్రి అనిల్‌కుమార్‌యాద‌వ్‌ సవాల్‌
 

అమ‌రావ‌తి: వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు లేకుండా టీడీపీ ఎన్నికలకు వెళ్లగలదా? ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించగలరా అంటూ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌ సవాల్‌ విసిరారు. 2024లో మేం ఒంటరిగా బరిలోకి దిగుతున్నామని.. ఒంటరిగా పోటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా అంటూ మంత్రి అనిల్‌ ప్రశ్నించారు. మండలిలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. ఛైర్మన్‌ వారిస్తున్నా వారు పట్టించుకోలేదు. టీడీపీ నేత‌ల తీరును స‌భ్యులు అభ్యంత‌రం తెలిపారు. 

Back to Top