టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
అచ్చెన్నాయుడువి మతిలేని మాటలు
23 Jul 2021 2:52 PM
మంత్రి అనిల్ కుమార్ యాదవ్
తాడేపల్లి: టీడీపీ నేత అచ్చెన్నాయుడువి మతిలేని మాటలు అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. 30 ఏళ్లుగా బీసీలను టీడీపీ మోసం చేస్తూనే వస్తోందని గుర్తుచేశారు. బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని మంత్రి అనిల్ తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. అచ్చెన్నాయుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం కౌంటర్ అటాక్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు ఎవరూ ఇవ్వని ప్రాధాన్యం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఇస్తున్నారన్నారని తెలిపారు. అర్ధ శాతం రాజకీయ పదవులు బడుగు, బలహీన వర్గాలకు సీఎం కేటాయించారని వివరించారు. ఒకేసారి 1,30,000 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనని ప్రకటించారు. సీఎం వైయస్ జగన్ వెంటే బీసీలు ఉండటాన్ని జీర్ణించుకోలేని అచ్చెన్నాయుడు విమర్శలు చేయటం సిగ్గుచేటని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.