రాజోలులో జనసేనకు భారీ షాక్భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి
టీడీపీ నేతలు విశాఖకు అనుకూలమా? వ్యతిరేకమా ?
20 Apr 2023 5:01 PM
మంత్రి గుడివాడ అమర్నాథ్
సీఎం వైయస్ జగన్ విశాఖ రాకను ఎవరూ అడ్డుకోలేరు
విశాఖ: ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు పరిపాలనా రాజధానిగా విశాఖకు అనుకూలమా వ్యతిరేకమా సమాధానం చెప్పాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండు చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖ వేదికగా పరిపాలన జరుగుతుంది..సీఎం వైయస్ జగన్ రాకను ఎవరు అడ్డుకోలేరన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం పరిపాలనను ఎక్కడ నుంచి అయినా నిర్వహించవచ్చు. వ్యవస్థలన్నీ ఇక్కడి నుంచే పని చేస్తాయన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. సీఎం వైయస్ జగన్ వైజాగ్ సెప్టెంబర్ లో కూడా రారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
వచ్చే నెల మూడో తేదీన భోగాపురం ఎయిర్ పోర్ట్ కు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎప్పుడైనా ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారా? అని మంత్రి ప్రశ్నించారు.