వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కాసేపట్లో ‘జగనన్న తోడు’ పథకం ప్రారంభం
25 Nov 2020 11:37 AM
తాడేపల్లి: మేనిఫెస్టోలో చెప్పిన మరో వాగ్దానానికి వైయస్ జగన్ ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. చిరువ్యాపారులకు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి అండగా.. వారి ఉపాధికి ఊతం ఇస్తూ ‘జగనన్న తోడు’ పథకాన్ని మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించనున్నారు. దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున బ్యాంకుల ద్వారా సుమారు రూ.1000 కోట్ల వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. తన పాదయాత్రలో చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారు పడుతున్న కష్టాలు చూసి చలించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్.. ఆ కష్టాల నుంచి వారికి విముక్తి కలిగించేందుకు జగనన్న తోడు పథకాన్ని తీసుకువచ్చారు.