బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
కిడాంబి శ్రీకాంత్కు సీఎం వైయస్ జగన్ సన్మానం
29 Dec 2021 2:18 PM
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రజతం సాధించిన శ్రీకాంత్
రూ.7 లక్షల నగదు అందజేత, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు 5 ఎకరాల స్థలం కేటాయింపు
తాడేపల్లి: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రజత పతకం సాధించి తొలి భారత పురుష షట్లర్గా సరికొత్త చరిత్ర సృష్టించిన కిడాంబి శ్రీకాంత్ను సీఎం వైయస్ జగన్ అభినందించారు. ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 19వ తేదీ వరకు స్పెయిన్లో జరిగిన 2021 బీడబ్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న శ్రీకాంత్.. రజత పతకం సాధించారు. ఈ మేరకు శ్రీకాంత్ను సీఎం వైయస్ జగన్ ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం తరఫున రూ. 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్గా శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి, స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, శాప్ ఎండీ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి, శాప్ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్ కృష్ణ పాల్గొన్నారు.