జీసీసీలో ప‌ని చేస్తున్న కుటుంబాల‌కు హెల్త్ కార్డులు

విశాఖ‌:  గిరిజన సహకార సంస్థ(జీసీసీ)లో ప‌ని చేస్తున్న కుటుంబాల‌కు డిప్యూటీ సీఎం పీడిక రాజ‌న్న దొర చేతుల మీదుగా హెల్త్ కార్డులు అంద‌జేశారు. గురువారం విశాఖపట్నం దసపల్లా హోటల్ లో గిరిజన సహకార సంస్థ  చైర్‌ప‌ర్స‌న్‌ డాక్టర్ శోభా స్స్వాతిరాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో గిరిజనశాఖా మంత్రి పీడిక రాజన్న దొర చేతులు మీదుగా జీసీసీ లో పనిచేస్తున్న వారి కుటుంబాలకి హెల్త్ కార్డ్స్ , జీసీసీ నూతన ప్రొడక్ట్స్ ను ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో ఎంపీ మాధ‌వి, ఎమ్మెల్యేలు కళావతి , భాగ్యలక్ష్మి, వైజాగ్ జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ సుభ‌ద్ర‌, జీసీసీ ఎండీ , జీసీసీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Back to Top