విజయవాడ: పింఛన్ల పంపిణీని అడ్డుకుంటున్న చంద్రబాబుకు పేదల ఉసురు తగులుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ నేతలు చేసిన కుట్ర వల్లే నేటికీ అవ్వతాతలకు పెన్షన్ అందలేదని మండిపడ్డారు. మంగళవారం వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఏమన్నారంటే.. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి సీఎం వైయస్ జగన్ను గెలిపిస్తారు. ఇంటికి వచ్చే పెన్షన్ని దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకున్నాడు. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, షర్మిల, పవన్ కళ్యాణ్ పేద ప్రజల మీద కక్ష కట్టారు. సుమారు 65 లక్షల మంది పెన్షన్లను ఎల్లో టీమ్ నిలిపివేశారు. పెన్షన్దారులు చంద్రబాబు అండ్ టీమ్కి బుద్ధి చెప్పేందుకు సిద్ధం. వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఇంటి వద్దకు పెన్షన్ ఏ విధంగా పంపిస్తారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేపట్టావా?. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లన్నీ ఎత్తివేసి టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి ఇస్తారంట. ఇలాంటి దుర్మార్గులకి ఓటు ఎందుకు వేయాలి. జన్మభూమి కమిటీలు పెట్టి టీడీపీ సానుభూతిపరులకే పెన్షన్లు ఇస్తారు. కులమతాలకు అతీతంగా సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారు. బుద్దా వెంకన్న, పోతిన మహేష్, వర్ల రామయ్యకు కూడా మేము సంక్షేమ పథకాలు అందించాం. టీడీపీ అధికారంలోకి రావడం కలగా మిగిలిపోతుంది నారా లోకేష్ ప్రజల పట్ల దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో నారా లోకేష్తో పనిలేదు. జనసేన కార్యకర్తలను, నాయకులను పవన్ మభ్యపెడుతున్నాడు. పవన్ మాటలకు పొంతనే ఉండదు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక సొంతిల్లు అయినా ఏర్పాటు చేసుకో. పవన్ గతంలో పాచిపోయిన లడ్డులు అని మోదీ కాళ్లు పట్టుకున్నాడు. మీ కన్న తల్లిని తిట్టిన వారితో నువ్వు పొత్తు పెట్టుకుని పల్లకీ మోస్తున్నావ్. వీటికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. పవన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు. పేదల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది.