కేశినేని నాని: – ప్రజల్లో అపూర్వమైన స్పందన వచ్చింది. – జరిగిన సంఘటనపై పోలీసు వారు విచారణ చేయాలి. – వెంటనే ఎన్నికల కమిషన్ కూడా స్పందించి దీనిపై నిజాలను నిగ్గు తేల్చాలి. – ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వారిని వెంటనే అరెస్ట్ చేసి సరైన రీతిలో స్పందించాలి. – ఎవరు చేసినా ఇది తప్పు. పోలీసులు విచారణ చేసి ఎవరు చేశారో చెప్పాలి. – నాకు తెలిసి ఇది ప్రతిపక్షాల కుట్ర కోణంగానే నేను చూస్తున్నాను. – ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్ గారిని అధికారంలోకి రాకుండా ఎవరూ ఆపలేరు. – ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ గారు గతంలో కంటే ఎక్కువ సీట్లతో ప్రభుత్వాన్ని ఫాం చేస్తారు. – ఇటువంటి కుట్రలు, కుటిల రాజకీయాలు ఆపితే మంచిందని నేను చెప్తున్నా. – ముందు పోలీసు విచారణ వెంటనే జరగాలి. ఇది చాలా తీవ్రమైన పరిణామం. – టార్గెటెడ్గా చేయకపోతే ఇది జరగదు. తప్పనిసరిగా దీనిలో ఏదో కుట్ర దాగిఉంది. – లోకేశ్ 600 మందిని హైర్ చేసుకుని కేవలం సోషల్ మీడియాపైనే బతుకుతున్నాడు. – అతను ఎవరిమీదైనా దుష్ప్రచారం చేయిస్తాడు. అతను అలా అలవాటు పడిపోయాడు. – ఇది తీవ్రమైన చర్య. ఇక్కడే కాదు..మేం ఢిల్లీలో కూడా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. – సీఎం గారికి సరైన సెక్యూరిటీ కూడా ఇవ్వాలని మేం కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. – మమ్మల్ని ఎదుర్కోలేకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారనడంలో సందేహం ఏమీ లేదు. – జగన్ గారి ప్రజాదరణను ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా విజయవాడలో ఈ తీరు విపరీతంగా ఉంది. – ఇటువంటి పరిస్థితుల్లో సీఎం గారి సెక్యూరిటీ పెంచాలి. ఆయన భద్రతకు టాప్ మోస్ట్ ప్రయారీ ఉండాలి. – చాలా కట్ అయింది. సీఎం గారు చాలా విలవిలలాడారు. అయినా ఆయన ఓర్చుకుని యాత్ర కంటిన్యూ చేశారు. *వెలంపల్లి శ్రీనివాస్:* – వైఎస్ జగన్ గారి మేమంతా సిద్ధం కార్యక్రమం ఎంతో విజయవంతం కావడం, లక్షలాది మంది ప్రజలు రోడ్డుపైకి వచ్చిన ఆయనకు దీవెనలు ఇచ్చిన తీరు చూశాం. – చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న తరుణంలో చంద్రబాబు, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసినా జగన్ ప్రభంజనాన్ని ఆపలేక ఈ దాడికి దిగారు. – వారు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు వారి వెంట లేరని తెలిసి ముఖ్యమంత్రి గారిపై హత్యా యత్నం చేశారు. – ముఖ్యమంత్రి గారికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. బ్లడ్ కారుతోంది. – పక్కనే ఉన్న నా కంటికి కూడా తగిలింది. ఇది చాలా దుర్మార్గం. – చంద్రబాబునాయుడికి పిల్లనిచ్చిన మామపై చెప్పులు విసిరిన దుర్మార్గుడు చంద్రబాబు. – జగన్ గారి ప్రభంజనం చూడలేక ఏదో ఒక విధంగా అంతమెందించాలనే కుట్రతోనే ఇది చేశారు. – చంద్రబాబు దుర్మార్గంగా తన తొత్తులతో చేయించిన దుశ్చర్య ఇది. – చంద్రబాబు కుట్ర చేసినా జగన్ గారు అంత దెబ్బ తగిలినా మళ్లీ పైకెళ్లి ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేసిన వ్యక్తి. – అటువంటి వ్యక్తి రక్తం కళ్లచూశాడు చంద్రబాబు. – చంద్రబాబు ఇటువంటి హత్యారాజకీయాలకు తెరలేపాడు. – గతంలో ఇలాగే విజయవాడ నడిబొడ్డున వంగవీటి మోహనరంగా గారిని హత్య చేశాడు. – విజయవాడలో ఇలాంటి కుట్రలు చంద్రబాబు ఎన్నో చేశాడు. – కరెంట్ లేని సమయంలో కావాలని చేసిన కుట్ర ఇది. – ఈ కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉంది. – జగన్ గారికి ఇటువంటి కుట్రల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. – చంద్రబాబు నీ నీచపు కుట్రలు ఇప్పటికైనా ఆపు. – ఒక ముఖ్యమంత్రిపై ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. – చంద్రబాబు తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. – ఇప్పటి వరకూ పది సర్వేలకు పైగా వచ్చాయి. జగన్ గారు స్వీప్ చేయబోతున్నారని చెప్తున్నాయి. – ఆయన్ను ఏదో ఒక విధంగా అంతమొందించాలని ఇది చంద్రబాబు చేసిన కుట్ర. – ఇలాంటి హత్యారాజకీయాలకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు. – అనేక రకాలుగా ప్రజల్ని మోసం చేయాలని పార్టీలను కలుపుకుని వచ్చాడు. – ప్రజలు నమ్మలేదు. ప్రజలంతా జగన్మోహన్రెడ్డి గారి వెంట ఉన్నారు. – అందుకే చంద్రబాబు ఈ కుట్రకు తెరలేపాడు. – ఈ కుట్రకు కారణం చంద్రబాబే. తన తొత్తులతోనే ఇది చేయించాడు. కేసు నమోదు విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు అయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదుతో సింగ్నగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. మరోవైపు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఘటనాస్థలంలో పోలీసులు ఆధారాలు సేకరించారు. పక్కా ప్లాన్ ప్రకారం సీఎం జగన్పై దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. క్లూస్ టీమ్, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏసీపీ స్థాయి అధికారులతో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్కు చేరుకోగానే ఆయనపై హత్యాయత్నం జరిగింది. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మపై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. కాగా ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్ ఎడమ కంటిపై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది.