కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైయస్ జగన్
19 Oct 2020 12:05 PM
56 కార్పొరేషన్ల ఏర్పాటుతో బీసీల్లో మనోధైర్యాన్ని పెంచారు
విజయవాడ వైయస్ఆర్ పార్కు వద్ద బీసీల సంబరాలు
పాల్గొన్న డిప్యూటీ సీఎం ధర్మాన, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ నేతలు
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, బీసీ గర్జనలో ప్రకటించిన విధంగా బీసీలకు పెద్దపీట వేశారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు ప్రకటించడంతో విజయవాడలోని వైయస్ఆర్ పార్కు వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. వైయస్ఆర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు బీసీ నేతలు క్షీరాభిషేకం చేశారు. బీసీల ఆశాజ్యోతి సీఎం వైయస్ జగన్కు రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్, పేర్ని నాని, కొడాలి నాని, ఎమ్మెల్యే జోగి రమేష్, భవకుమార్, సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. 56 కార్పొరేషన్ల ఏర్పాటును బీసీలంతా పండుగలా జరుపుకుంటున్నారని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ బీసీ గర్జనలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారన్నారు. మంత్రివర్గ విస్తరణలోనూ సీఎం వైయస్ జగన్ బీసీలకు పెద్దపీట వేశారన్నారు. సీఎం వైయస్ జగన్ బీసీలలో మనోధైర్యాన్ని పెంచారన్నారు. చంద్రబాబు పాలనలో బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు.