తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్, క్రికెటర్ అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎస్కే టీంను ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందించారు. ఏపీలో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి అంబటి రాయుడు వివరించారు. వారి సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఇటీవల ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ట్రోఫీని ముఖ్యమంత్రికి సీఎస్కే ఫ్రాంచైజీ ఓనర్ ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్, అంబటి రాయుడు చూపించారు. సీఎస్కే టీం సభ్యుల ఆటోగ్రాఫ్తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి రూపా గురునాథ్, అంబటి రాయుడు బహుకరించారు.