కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎస్వీబీసీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం
19 Sep 2020 5:20 PM
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల: ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నామని సుబ్బారెడ్డి చెప్పారు. అన్ని సంప్రదాయల ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఈనెల 23న తిరుమల శ్రీవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 7గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తిరుమల చేరుకుంటారని, ఈనెల 24వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు శ్రీవారి దర్శించుకుంటారని వెల్లడించారు.
అనంతరం శ్రీవారి ఆలయం ఎదుట నాద నీరాజనంలో జరిగే సుందరకాండ పారాయణంలో పాల్గొంటారని తెలిపారు. తిరుమలలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించే వసతి సముదాయాల శంకుస్థాపన కార్యక్రమములో ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు పాల్గొంటారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.