పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వండి

ప్రధాని నరేంద్రమోడీకి సీఎం వైయస్‌ జగన్‌ లేఖ

తాడేపల్లి: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సీఎం వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. అంతకు ముందు గుంటూరు మాచర్లలో నివాసం ఉంటున్న పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను సీఎం వైయస్‌ జగన్‌ స్వయంగా వెళ్లి కలుసుకున్నారు. పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మిని ఘనంగా సత్కరించి.. ఆమెకు రూ.75 లక్షల చెక్కును అందించారు. 
 

Back to Top