పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు?
కాసేపట్లో నరసరావుపేటలో గోపూజ మహోత్సవం
15 Jan 2021 11:16 AM
గోపూజ మహోత్సవంలో పాల్గొననున్న సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగే గోపూజ మహోత్సవంలో కాసేపట్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 2,679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్న సీఎం.. ఉదయం 11.25 గంటలకు నరసరావుపేట చేరుకోనున్నారు. మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొనున్నారు మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి సీఎం వైయస్ జగన్ తాడేపల్లి చేరుకోనున్నారు.