చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
కాసేపట్లో ‘స్పందన’పై సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
29 Sep 2022 11:29 AM
పలు కీలక అంశాలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం
తాడేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో.. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కేటాయించిన నిధులపై సీఎం సమీక్షించనున్నారు. వ్యవసాయ ఈ–క్రాపింగ్పై, ఇళ్ల స్థలాలు, జగనన్న గృహ నిర్మాణ పథకం, టిడ్కో ఇళ్లపై కలెక్టర్లు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా ‘స్పందన’కు వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించనున్నారు. అంతేకాకుండా జాతీయ రహదారులకు కావాల్సిన భూ సేకరణపై, వైయస్ఆర్ అర్బన్, విలేజ్ క్లినిక్స్పై దిశానిర్దేశం చేయనున్నారు.