కాసేపట్లో ‘స్పందన’పై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

తాడేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడనున్నారు. ఈ సమీక్షలో.. కోవిడ్‌ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షించనున్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణంపై చర్చించనున్నారు. స్కూళ్లలో నాడు–నేడు రెండో దశ, అంగన్‌వాడీ పనులపై, అదే విధంగా ప్రజల నుంచి వస్తున్న ‘స్పందన’ ఫిర్యాదులపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించనున్నారు. 
 

Back to Top