తాడేపల్లి: జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ 2023–24 ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాది పొడవునా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తున్నామన్నది సంక్షేమ క్యాలెండర్ ద్వారా ముందుగానే ప్రకటించి మరీ తదనుగుణంగా లబ్ధిని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైయస్ జగన్ ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే సంక్షేమ పథకాల ద్వారా అందించిన లబ్ధి (డీబీటీ, నాన్ డీబీటీ) రూ. 2,96,148.09 కోట్లు నెలల వారీగా ప్రభుత్వం అందజేయనున్న సంక్షేమ పథకాల వివరాలను సంక్షేమ క్యాలెండర్లో పొందుపరిచారు. ఆ వివరాలను గమనిస్తే... ఏప్రిల్ 2023 – జగనన్న వసతి దీవెన, వైయస్ఆర్ ఈబీసీ నేస్తం మే 2023 – వైయస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ (మొదటి విడత), వైయస్ఆర్ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైయస్ఆర్ కళ్యాణమస్తు–షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైయస్ఆర్ మత్స్యకార భరోసా జూన్ 2023 – జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైయస్ఆర్ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి జులై 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైయస్ఆర్ నేతన్న నేస్తం, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైయస్ఆర్ సున్నా వడ్డీ (ఎస్హెచ్జీ), వైయస్ఆర్ కళ్యాణమస్తు–షాదీతోఫా (రెండో త్రైమాసికం) ఆగష్టు 2023 – జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైయస్ఆర్ కాపు నేస్తం, వైయస్ఆర్ వాహనమిత్ర సెప్టెంబర్ 2023 – వైయస్ఆర్ చేయూత అక్టోబర్ 2023 – వైయస్ఆర్ రైతుభరోసా – పీఎం కిసాన్ (రెండవ విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత) నవంబర్ 2023 – వైయస్ఆర్ సున్నావడ్డీ – పంట రుణాలు, వైయస్ఆర్ కళ్యాణమస్తు–షాదీతోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడవ విడత) డిసెంబర్ 2023 – జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండవ విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి జనవరి 2024 – వైయస్ఆర్ రైతుభరోసా – పీఎం కిసాన్ (మూడవ విడత), వైయస్ఆర్ ఆసరా, జగనన్న తోడు (రెండవ విడత), వైయస్ఆర్ లా నేస్తం (రెండవ విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ. 3000) ఫిబ్రవరి 2024 – జగనన్న విద్యా దీవెన (నాల్గవ విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (నాల్గవ త్రైమాసికం), వైయస్ఆర్ ఈబీసీ నేస్తం మార్చి 2024 – జగనన్న వసతి దీవెన (రెండవ విడత), ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమాచార శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు.