కలెక్టర్లతో సీఎం వైయ‌స్ జగన్ వీడియో కాన్ఫరెన్స్

 తాడేపల్లి: జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి  స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. విద్య, వైద్యంలో నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్షించనున్నారు. 
అలాగే వైయ‌స్సార్ అర్బన్ క్లినిక్స్‌తో పాటు జగనన్న గృహనిర్మాణ పథకం, ఇళ్ళ పట్టల పంపిణీపైనా సమీక్ష నిర్వహిస్తారు. టిడ్కో ఇళ్లపై దిశానిర్దేశం చేయనున్న సీఎం వైయ‌స్‌ జగన్‌.. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష సర్వే పైనా సమీక్ష నిర్వహిస్తారు. అలాగే స్పందన కార్యక్రమంలో వస్తున్న పిర్యాదులు పరిష్కారం.. పురోగతి పైనా ఆయన సమీక్ష చేపట్టనున్నారు.

Back to Top