తాడేపల్లి: ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో ‘నాడు–నేడు’ కింద జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం సమీక్షిస్తున్నారు. ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు, ఆరోగ్యశ్రీ అమలు వంటి తదితర అంశాలపై సీఎం వైయస్ జగన్ అధికారులతో చర్చిస్తున్నారు.