ఆ పథకాలతో నిజమైన మహిళా సాధికారిత..ఆర్థిక స్వావలంబన 

ఆసరా, చేయూతలపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సమీక్ష

తాడేప‌ల్లి: ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలతో నిజమైన మహిళా సాధికారితకు, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం దారులు పరుస్తోందని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్సార్‌ ఆసరా, చేయూత కార్యక్రమాలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఆసరా కార్యక్రమం వివరాలను సీఎంకు వివరించిన అధికారులు. మొదటి విడత ఆసరా కింద దాదాపు 8 లక్షల పైచిలుకు డ్వాక్రా గ్రూపులకు లబ్ధి క‌లుగుతుంద‌న్నారు. రూ.6330.58 కోట్ల రూపాయలను మహిళల చేతిలో పెట్టిన ప్రభుత్వం. రెండో విడత ఆసరా సన్నాహకాలను వివరించిన అధికారులు. లబ్ధిదారుల జాబితాపై సామాజిక తనఖీ పూర్తయిందని, గ్రామ సచివాలయాల్లో కూడా ఆ జాబితాలను ప్రదర్శించామని తెలిపిన అధికారులు వీటితోపాటు ఆసరా, చేయూతల కింద మహిళల్లో సుస్థిర ఆర్థిక ప్రగతికోసం చేపడుతున్న ఉపాధిమార్గాలు, వాటి అమలు కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించిన సీఎం..

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...?

– గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి మోసం చేసింది. 
ఈ నేపథ్యంలో ఆ రుణాలను అక్కచెల్లెమ్మలు చెల్లించలేదు. చివరకు వడ్డీలుకూడా చెల్లించలేక తడిసి మోపెడై అక్కచెల్లెమ్మలు పరిస్థితి దారుణంగా మారిన నేపథ్యంలో... కట్టలేని ఆ రుణాలను నాలుగు దఫాలుగా ప్రభుత్వమే చెల్లిస్తోంది.
– అంతేకాదు 2016లో రద్దైపోయిన సున్నావడ్డీ రుణాలను మళ్లీ తిరిగి పునరుజ్జీవింపచేసి, మహిళలను ఆదుకోవడమే కాకుండా వారి కాళ్లమీద వాళ్లు నిలబడేట్టుగా ఐటీసీ, రిలయన్స్, అమూల్‌ లాంటి దిగ్గజ కంపెనీలను భాగస్వాములను చేసి, వారికి వ్యాపార మార్గాలను చూపించింది.
ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలతో నిజమైన మహిళా సాధికారితకు, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం దారులు పరుస్తోంది. 
– 2014లో చంద్రబాబు అక్కచెల్లెమ్మల రుణాలను మాఫీచేసి ఉండిఉంటే... అక్కడితో భారం పోయేది. కాని, చంద్రబాబు కట్టవద్దని చెప్పి, హామీ ఇచ్చి వాటిని కట్టకపోవడంతో మహిళలపై ఆ భారం అమాంతంగా పడింది. 
ఇలాంటి పరిస్థితుల్లో మహిళలను ఆదుకోకపోవడం వల్ల మొత్తం వ్యవస్థే ఛిన్నా భిన్నం అయ్యింది. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ కూడా ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయాయి. 

– పాదయాత్రలో నేను వెళ్లినప్పుడు ప్రతి మహిళా చేసిన డిమాండ్‌ .. డ్వాక్రారుణాలు మాఫీచేయమని, మా పరిస్థితి బాగోలేదని చెప్పారు. 
– ఈ నేపథ్యంలోనే ఆసరా, చేయూతలను తీసుకు వచ్చాం. 
– మహిళల్లో స్థిరమైన ఆర్థిక అభివృద్ధికోసం చేపడుతున్న కార్యక్రమాలను మళ్లీ ఒకసారి సమీక్షించి... మరింతమందికి లబ్ధి చేకూర్చేలా కార్యక్రమాలను చేపట్టాలి. 
– ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో అవగాహన, చైతన్యం కల్పించాలి. 
ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక భరోసా... వారి జీవనప్రమాణాలను పెంచేందుకు ఉపయోగపడాలి. రెండో విడత ఆసరానును ఉంచుకుని ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలి.
–ప్రజాప్రతినిధులను కూడా ఇందులో పాల్గొనేలా కార్యక్రమాలను రూపొందించాలన్న సీఎం.
– ఆసరా కింద ఇచ్చే డబ్బును బ్యాంకులు జమచేసుకోలేని విధంగా అన్‌ ఇంకబర్డ్‌ఖాతాల్లో జమచేయాలన్న సీఎం.

– స్థిర ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఉపాధి మార్గాల కోసం బ్యాంకులు రుణాలు ఇప్పించేలా స్పాట్‌ డాక్యుమెంటేషన్‌ జరిగేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశం
– అలాగే ఇళ్ల లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మలకు రూ.35వేల చొప్పున పావలా వడ్డీకి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. 

వైయస్సార్‌ చేయూతపైనా సీఎం సమీక్ష.
- చేయూతపై సీఎంకు వివరాలందించిన అధికారులు
– వైయస్సార్‌ చేయూత మొదటి విడతద్వారా దాదాపు 3 లక్షలమంది మహిళలకు సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేశామన్న అధికారులు.
– రిటైల్‌ షాపులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు పెంపకం తదితర ఉపాధిమార్గాలను కల్పించామన్న అధికారులు
– రెండో విడతలో 2,21,598 మంది మహిళలకు ఉపాధిమార్గాల కల్పనకు కొనసాగుతున్న కార్యక్రమాలు
– మహిళలు చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి మార్కెటింగ్‌ సమస్య ఉత్పన్నం కావొద్దని స్పష్టంచేసిన సీఎం
– మనం ఎలాంటి ఉపాధిమార్గం చూపినా మహిళలు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం

– గత ఏడాది ప్రాక్టర్‌ అండ్‌ గాంబిల్, ఐటీసీ, హిందుస్థాన్‌ యూనిలీవర్, రిలయన్స్‌ రిటైల్, అమూల్, అల్లానాలతో కలిసి సుస్థిర ఆర్థిక ప్రగతి కార్యక్రమాలు చేపట్టామన్న అధికారులు
– ఈ ఏడాది రిలయన్స్‌కు చెందిన అజియో, టనాజెర్, గ్రామీణ వికాస్‌ కేంద్ర, మహీంద్రా, గెయిన్, కల్‌గుడి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదర్చుకుంటున్నామన్న అధికారులు

– ఆసరా, చేయూత కింద మనం ఇచ్చే డబ్బును మహిళలు సుస్థిర జీవనోపాధికోసం వినియోగించుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశమన్న సీఎం.
– సుస్థిర జీవనోపాధి మార్గాలద్వారా విజయవంతం అయిన మహిళలద్వారా ఇతర మహిళలు స్ఫూర్తి పొందాలన్న సీఎం. 
– వారు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలు, పశుపోషణద్వారా పొందుతున్నా ఆదాయాల వివరాలను ఇతర మహిళలకు వివరించాలని అధికారులకు సీఎం నిర్దేశం.

ఈ సమీక్షా సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి సత్యనారాయణ, సెర్ఫ్‌ సీఈఓ ఏ ఎండీ ఇంతియాజ్, మెప్మా ఎండీ వి విజయలక్ష్మి, స్త్రీనిధి ఎండీ నాంచారయ్య, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ ఆర్‌ అమరేంద్ర కుమార్, సెర్ఫ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఎం మహిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top