మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
శుద్ధమైన తాగునీటిని అందించాలి
30 Aug 2019 12:56 PM
వాటర్ గ్రిడ్పై సీఎం వైయస్ జగన్ సమీక్ష
తాడేపల్లి: ప్రజలకు శుద్ధమైన తాగునీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. వాటర్ గ్రిడ్పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు పలు కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. వాటర్ గ్రిడ్ పథకం మూడు దశల్లో పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటా వర్తింపజేయాలన్నారు. తొలి దశలో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో తాగునీటి వసతి. రెండో దశలో విజయనగరం, విశాఖ, రాయలసీమలో శుభ్రమైన తాగునీరు. మూడో దశలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. నీటిని తీసుకున్న చోటే శుద్ధి చేసి సరఫరా చేయాలని నిర్ణయించారు. దీనిపై అధ్యయనం చేసి ప్రణాళిక ఖరారు చేయాలని సీఎం వైయస్ జగన్ అధికారులకు సూచించారు. తాగునీటి చెరువులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పరిగణలోకి తీసుకోలని, కిడ్నీ బాధిత ప్రాంతాల్లో ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి నేరుగా ఇళ్లకే తాగునీటిని సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. సమీక్షా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.