తాడేపల్లి: హౌసింగ్ కింద ఇళ్లనిర్మాణం వేగాన్ని పెంచాలని అధికారులకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. గడిచిన అక్టోబరులో 7.43 లక్షల ఇళ్లను ఇప్పటికే అక్కచెల్లెమ్మలకు అందించామన్న అధికారులు. ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తిచేసే దిశగా ముందుకు సాగుతున్నామన్న అధికారులు. వీటికి సంబంధించిన పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయని వెల్లడి. అలాగే ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు అక్టోబరులో లబ్ధిదారులకు అందించిన ఇళ్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై నిశితంగా పరిశీలన చేశామని వెల్లడి. కరెంటు, తాగునీరు సదుపాయాలను కల్పించామని, మాజిక్ సోక్ పిట్స్ తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడి. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ జరపాలన్న సీఎం ఎక్కడ ఏ సమస్యను గుర్తించినా వెంటనే దాన్ని సరిదిద్దేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. నిర్మాణాలు పూర్తిచేసుకున్న ప్రతి ఇంటినీ ఆడిట్ చేసి సదుపాయాలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై ఆడిట్ నిర్వహించాలన్న సీఎం. కరెంటు, తాగునీరు, సోక్ పిట్స్ ఉన్నాయా? లేవా? అన్నవాటిపై ఆడిట్ చేయించాలన్న సీఎం. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటిరకూ 12,72,143 మంది అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున రుణాలు. రూ.4,483 కోట్ల రుణాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు. పావలా వడ్డీ రుణాలపై చెల్లించాల్సిన మిగిలిన వడ్డీ భారాన్ని భరించనున్న ప్రభుత్వం. ఇప్పటివరకూ తీసుకున్న రుణాలపై వడ్డీ డబ్బు విడుదలకు సన్నద్ధం కావాలని సీఎం ఆదేశం. టిడ్కో ఇళ్ల నిర్మాణంపైనా సీఎం సమీక్ష. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం. లబ్ధిదారులతో ఏర్పాటుచేసిన అసోసియేషన్లు సమర్థవంతంగా పనిచేసేలా వారికి తగిన అవగాహన కల్పించాలన్న సీఎం. ప్రభుత్వం ఇచ్చిన లక్షల విలువైన ఆస్తిని ఎలా నిర్వహించుకోవాలన్నదానిపై వారికి అవగాహన ఇవ్వాలన్న సీఎం. తద్వారా భవనాలు నిరంతరం నాణ్యతగా ఉండేలా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోగలుగుతారన్న సీఎం. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న సీఎం.