తాడేపల్లి: ఇంధన శాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి విద్యుత్, అటవీ పర్యావరణం, భూగర్భ గనులు, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, విద్యుత్ శాఖస్పెషల్ సీఎస్ కె విజయానంద్, ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్. రావత్, ఏపీ జెన్కో ఎండీ బి. శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.