మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
26 May 2021 12:20 PM
కలెక్టర్లకు సీఎం వైయస్ జగన్ దిశా నిర్దేశం
తాడేపల్లి: యాస్ తుపాను నేపథ్యంలో కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. యాస్ తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు చర్యలపై కలెక్టర్లు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. యాస్ తుపానుకు సంబంధించి వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైయస్ జగన్ సూచించారు.
కాగా, అతి తీవ్ర తుపాను యాస్ తీరానికి చేరువైంది. కాసేపట్లో ఒడిశాలోని బాలాసోర్ దక్షిణ ప్రాంతంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని వివరించింది.