ఇసుక మాఫియా, స్మగ్లింగ్‌  నివారణకు కఠిన చర్యలు 

ఇసుక విధానంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష
 

తాడేపల్లి: ఇసుక మాఫియా, స్మగ్లింగ్‌ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేవారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇసుక విధానంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు.ఇసుక ధరలకు కళ్లెం వేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.  ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా ఆర్డినెన్స్‌ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లాలు, నియోజకవర్గాల వారిగా ధలను నిర్ణయించాలని కలెక్టర్లు, గనుల శాఖ అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. 

Read Also: సీఎం వైయస్‌ జగన్‌ అందరివాడు

Back to Top