తాడేపల్లి: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్ బాషా, ఎమ్మెల్సీ మహమ్మద్ కరీమున్నిసా, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ పాల్గొన్నారు.