తాడేపల్లి: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజిట్ ఆంధ్రప్రదేశ్ క్యాంపెయిన్లో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించారు. జియో పోర్టల్ ఆధారంగా పర్యాటక సమాచార వ్యవస్థను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. ఈ మేరకు వచ్చే ఏడాదిని విజిట్ ఆంధ్రప్రదేశ్-2023గా సీఎం వైయస్ జగన్ ప్రకటించారు. అనంతరం రాష్ట్రంలోని వైవిధ్య ఉత్సవాల బ్రోచర్లను సీఎం వైయస్ జగన్ ఆవిష్కరించారు.
రాష్ట్ర పర్యాటక అభివృద్దిలో భాగంగా విజిట్ ఆంధ్రప్రదేశ్ 2023 క్యాంపెయిన్ను ప్రారంభించిన సీఎం, అనంతరం క్యాంపెయిన్ బ్రోచర్ల ఆవిష్కరణ
రాష్ట్రంలో సులువుగా పర్యాటక ప్రదేశాలను గుర్తించేందుకు వీలుగా రూపొందించిన జీఐఎస్ వెబ్పోర్టల్ను ప్రారంభించిన సీఎం
పర్యాటక అభివృద్దిలో కీలకపాత్ర పోషిస్తూ టూరిజం, ట్రావెల్, ఆతిధ్య రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచాలన్న సీఎం
ఈ సందర్భంగా అరకు నుంచి వచ్చిన గిరిజన థింసా నృత్య కళాకారులతో ముచ్చటించిన సీఎం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక, సాంస్కృతిక శాఖ స్సెషల్ సీఎస్ డాక్టర్ రజత్ భార్గవ, ఇతర అధికారులు.
