సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ హామీ.. గంటలో పరిష్కారం

తొమ్మిది మంది అర్జి దారులకు తొమ్మిది లక్షల రూపాయల చెక్కుల పంపిణీ

కలెక్టర్ చేతుల మీదుగా చెక్కు అందుచేత 

భీమ‌వ‌రం: రాష్ట్ర ముఖ్యమంత్రి   వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి శుక్రవారం భీమవరం పరిరక్షణ సందర్భంగా పలువురులతో సమస్యలను వినడంతో పాటు తక్షణం వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు 

శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సదరు 9 మంది అర్జి దారులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను జాయింట్ కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి తో కలిసి అందజేశారు. 

ఈ సందర్భంగా స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆమేరకు సిఎం ను కలిసిన 9 మందికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున రూ.9 లక్షల ను అందచెయ్యడం జరిగిందన్నారు.

చెక్కులు అందుకున్న వారి వివరాలు..

  • కడలి నాగలక్ష్మి, తండ్రి కడలి సత్యనారాయణ, ఎల్ బి చర్ల గ్రామం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా,  భూ పరిష్కారంలో పరిహారం అందజేశారు
  • ఎల్లమల్లి అన్నపూర్ణ, 29వ వార్డు, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. భర్త చనిపోయారు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది
  • చిల్లి సుమతి, బోడ్డి పట్ల గ్రామం, ఎలమంచిలి మండలం, పశ్చిమగోదావరి జిల్లా,.. బాబుకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఆర్థిక సహాయం
  • కంతేటి దుర్గ భవాని, వైఫ్ ఆఫ్ నాగ వెంకట రవితేజ, శ్రీరామవరం, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా.  వైద్య సహాయం నిమిత్తం..
  • తేతలి గీత, వైఫ్/ఆఫ్ లేట్ టి ఎస్ ఎస్ ఎన్ రెడ్డి, ఫైర్ స్టేషన్ సెంటర్, ఏలూరు, ఏలూరు జిల్లా.. భర్త మరణించడం వల్ల ఆర్థిక సహాయం
  • అరుగుల లాజరస్, పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా  కుమారునికి వైద్య సహాయం నిమిత్తం
  • అందుగుల లాజర్, పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా  కుమారునికి వైద్య సహాయం నిమిత్తం
  • గుడాల అపర్ణ జ్యోతి, తిరుపతి పురం, అత్తిలి, పశ్చిమగోదావరి జిల్లా. వైద్య సహాయం నిమిత్తం
  • కోరాడ వీర వెంకట సత్యనారాయణ, పొలసానపల్లి గ్రామం, భీమడోలు మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. వైద్య ఖర్చులు నిమిత్తం సహాయం   
  •  చిన్నారికి నామకరణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

శుక్రవారం విద్య దీవెన నిధులు విడుదల కార్యక్రమానికి భీమవరం విచ్చేసిన ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిని స్థానిక లూధరన్ గ్రౌండ్స్ హెలిపాడ్ వద్ద చిట్టూరి సోనీ, చిట్టూరి మోహన్ కుమార్ దంపతులు వారి ఐదు నెలల చిన్నారితో కలిసి ముఖ్యమంత్రిని కలవడం జరిగింది.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి, వారి తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే మా కుటుంబానికి ఎంతో అభిమానం అని, ఈరోజు ముఖ్యమంత్రిని కలిసి తన బిడ్డకు నామకరణ చేసుకోవాలని కో

Back to Top