మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
గొల్లప్రోలు చేరుకున్న సీఎం వైయస్ జగన్
29 Jul 2022 11:12 AM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకు చేరుకున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం కొద్దిసేపటి క్రితమే గొల్లప్రోలుకు చేరుకున్నారు. వైయస్ఆర్ కాపు నేస్తం మూడో విడుత సాయం గొల్లప్రోలు వేదికగా కంప్యూటర్ బటన్ నొక్కి మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. వరుసగా మూడో ఏడాది కాపు నేస్తం అమలుకు సర్వత్రా ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది పేద అక్కచెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లో రూ.508.18 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైయస్ జగన్ జమ చేయనున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైయస్ఆర్ కాపు నేస్తం అమలు చేస్తున్నారు.