వైద్య ఆరోగ్య శాఖ‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

డిజిటల్‌ హెల్త్‌లో రాష్ట్ర‌ ప్రభుత్వానికి రెండు గ్లోబల్‌ అవార్డులు

అవార్డుల‌ను సీఎంకు అంద‌జేసిన మంత్రి విడ‌ద‌ల ర‌జిని

తాడేప‌ల్లి: డిజిటల్‌ హెల్త్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రెండు గ్లోబల్‌ అవార్డులు ద‌క్కాయి. ఈ మేర‌కు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, అధికారులు, సిబ్బందిని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్దికి ప్రవేశపెట్టిన సంస్కరణలు, అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రెండు గ్లోబల్‌ డిజిటల్‌ హెల్త్‌ అవార్డులు వ‌రించాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్‌ డిజిటల్‌ హెల్త్‌ సమ్మిట్‌ 2022లో అవార్డుల‌ను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అందుకున్నారు. ఈ మేర‌కు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ను మంత్రి విడదల రజిని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు కలిసి అవార్డు వివరాలు తెలిపారు. 

Back to Top