కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఔదార్యం
03 Dec 2022 2:46 PM
వివిధ వ్యాధులతో బాధపడుతున్న రైతు, ఇద్దరు చిన్నారుల చికిత్సకు ఆర్థిక సహాయం
వైయస్ఆర్ జిల్లా : వివిధ వ్యాధులతో బాధపడుతున్న అనంతపురానికి చెందిన ఓ రైతు, పులివెందులకు చెందిన ఇద్దరు చిన్న పిల్లల మెరుగైన వైద్య కోసం ఆర్ధిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
అనంతపురం జిల్లా, నార్పల మండలం, గూగుడు గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి అనే రైతు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నట్లు భార్య శివజ్యోతి తమ ముగ్గురు పిల్లలు సౌమ్య, హరిప్రియ, యమినిలతో కలసి ముఖ్యమంత్రిని కలసి అర్జీ సమర్పించారు. నవంబర్ 12 నుంచి ఆస్టర్ సి.ఎం.ఇ బెంగళూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తన భర్తకు రూ. 20 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని, మీరే ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్కు విన్నవించింది. అనంతరం వారితో మాట్లాడిన ముఖ్యమంత్రి తక్షణమే రూ.2లక్షలు మీ అకౌంట్ లోకి వేస్తామని, పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరించి చికిత్స అందిస్తామని భరోసా కల్పించారు.
పులివెందులలో నివసిస్తున్న కె.శివకుమార్, టైలరింగ్ చేసుకుంటూ భార్య జి.వరలక్షి గృహిణిగా ఇద్దరు పిల్లలు 8ఏళ్ల హైందవ్, 5ఏళ్ల కుషల్ లతో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. మా ఇద్దరు పిల్లలు తీవ్రమైన అనిమియా వ్యాధితో బాధపడుతున్నారని, వారికి రక్తం పెరుగుదలకు ఇంజక్షన్ వాడుతున్నామన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు తిరిగామన్నారు. ఈ వ్యాధి ఆరోగ్యశ్రీ కిందకు రాదన్నారని, ప్రస్తుతం హైదరాబాద్ లోని అమెరికన్ అంకాలజిస్ట్ దగ్గర చికిత్స చేయిస్తున్నామని ఇప్పటికి రూ.15 లక్షలు ఖర్చు అయిందని, సర్వం కోల్పోయామని, మీరే మమ్మల్ని మా పిల్లల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ను కలసి అర్జీ సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి పిల్లల ఆరోగ్యానికి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.