ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం వైయస్ జగన్
23 Sep 2020 3:38 PM
ఘనస్వాగతం పలికిన నాయకులు
తిరుపతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి తిరుపతి పర్యటనకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్ కొద్దిసేపటి క్రితమే రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. సీఎం వైయస్ జగన్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. సీఎం వైయస్ జగన్ రేణిగుంట నుంచి రోడ్డుమార్గం ద్వారా తిరుమల శ్రీపద్మావతి గెస్ట్హౌస్కు చేరుకోనున్నారు. సాయంత్రం అన్నమయ్య భవన్ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. సాయంత్రం 6:15 గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకొని ప్రభుత్వ తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకుంటారు. రాత్రి 7:40 గంటలకు పద్మావతి గెస్ట్హౌస్కు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు.