ప్రొద్దుటూరు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రొద్దుటూరు చేరుకున్నారు. మూడు రోజుల వైయస్‌ఆర్‌ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌ కొద్దిసేపటి క్రితమే ప్రొద్దుటూరు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.515.90 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 

– ప్రొద్దుటూరులోని 5 ప్రధాన మురికి కాల్వల పనులకు రూ.163 కోట్లు.
– నూతన మంచినీటి పైపులైన్‌ నిర్మాణానికి రూ.119 కోట్లు. 
– నూతన కూరగాయల మార్కెట్‌ కోసం రూ. 50.90 కోట్లు. 
– పెన్నా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ. 53 కోట్లు. 
– జిల్లా ఆస్పత్రి మౌలిక వసతులకు రూ. 20.50 కోట్లు. 
– ఆర్టీసీ బస్టాండ్‌ ఆధునీకరణకు రూ.4.5 కోట్లు. 
– యోగి వేమన ఇంజినీరింగ్‌ కాలేజీ మౌలిక వసతుల కోసం రూ. 66 కోట్లు. 
– ఎస్‌సీఎన్‌ఆర్‌ డిగ్రీ కాలేజీ నూతన గదుల నిర్మాణం కోసం రూ.24 కోట్లతో నిర్మాణ పనులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం ప్రొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొని సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. 
 

Back to Top