మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
జవాన్ల మృతిపై సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి
05 Apr 2021 3:34 PM
ఏపీకి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ఆర్థికసాయం
తాడేపల్లి: ఛత్తీస్ఘడ్ ఘటనలో జవాన్ల మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు జవాన్లు మృతిచెందారు. ఈ సందర్భంగా జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీఎం.. ఆ కుటుంబాలను ఆదుకుంటామని హామీనిచ్చారు. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాన్ రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన జవాన్ శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఆర్థికసాయాన్ని వెంటనే అందించి.. బాసటగా నిలవాలని సీఎంఓ అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు.