తాడేపల్లి: వైయస్ఆర్ కళ్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అందుకనే లబ్ధిదారైన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన పెట్టామని సీఎం స్పష్టం చేశారు. బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలని సీఎం ఆదేశించారు. అంగన్వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్ష ముఖ్యాంశాలు ఇలా.. – స్కూళ్లలో టాయిలెట్ల మెయింటెనెన్స్ కోసం ఏర్పాటుచేసిన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణకోసం ఏర్పాటుచేసిన ఎస్ఎంఎఫ్ తరహాలో అంగన్వాడీల నిర్వహణ, పరిశుభ్రతకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం. – అంగన్వాడీలకు కూడా ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్లు ఏర్పాటుచేయాలన్న సీఎం. – టాయిలెట్ల మరమ్మతు పనులు చేపట్టాలని సీఎం ఆదేశం. – అంగన్వాడీ పిల్లలకు ఇప్పటి నుంచే భాష, ఉచ్ఛారణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం. – పాఠశాల విద్యాశాఖతో కలిసి పగడ్బందీగా పీపీ–1, పీపీ–2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలన్న సీఎం. – అన్నీకూడా బైలింగువల్ టెక్ట్స్బుక్స్ ఉండాలన్న సీఎం. – అంగన్వాడీలకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీపై సమావేశంలో చర్చ. – ప్రస్తుతం జరుగుతున్న కొనుగోలు, పంపిణీ విధానాలను సమగ్రంగా సమీక్షించిన సీఎం. – పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్నదే ప్రధాన ఉద్దేశమన్న సీఎం. – పంపిణీలో కూడా అక్కడక్కడా లోపాలు తలెత్తుతున్న సమాచారం నేపథ్యంలో పగడ్బందీ విధానాలు అమలు చేయాలన్న సీఎం. – నాణ్యతను పూర్తిస్థాయిలో చెక్చేసిన తర్వాతనే పిల్లలకు చేరాలన్న సీఎం. – మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు, పంపిణీని పైలట్ప్రాజెక్ట్ కింద చేపట్టాలని సూత్రప్రాయ నిర్ణయం. – పేరొందిన సంస్థతో థర్డ్ఫార్టీ తనిఖీలు జరిగేలా చూడాలన్న సీఎం. – బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలన్న సీఎం. – కళ్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్న సీఎం. – అందుకనే లబ్ధిదారైన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన పెట్టామన్న సీఎం. – అన్ని అంగన్వాడీలకు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్ చేసిన బియ్యాన్నే పంపిణీచేయాలన్న సీఎం. – ఎస్డీజీ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం. – ఈ లక్ష్యాలను చేరుకునే కార్యక్రమాల అమలుపై పటిష్టంగా పర్యవేక్షణ చేయాలన్న సీఎం. – అంగన్వాడీల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక నంబర్తో ఉన్న పోస్టర్ను ప్రతి అంగన్వాడీలో ఉంచాలని సీఎం ఆదేశం. – పోస్టర్లు కచ్చితంగా ఉంచే బాధ్యతలను అంగన్వాడీలకు అప్పగించాలన్న సీఎం. – సెప్టెంబరు 30 కల్లా అంగన్వాడీ సూపర్ వైజర్ల పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడించిన అధికారులు. – సీఎం ఆదేశాలమేరకు అత్యంత పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నామన్న అధికారులు. – ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామన్న అధికారులు. – పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అవసరమనుకుంటే.. తమ ఆన్సర్షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం ఉందన్న అధికారులు. – పరీక్షల ప్రక్రియను పూర్తిచేసి సెప్టెంబరు 30 కల్లా సూపర్వైజర్లను నియమించేలా చర్యలు తీసుకుంటామన్న అధికారులు. – దివ్యాంగులకోసం ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్ను అప్గ్రేడ్ చేయాలని సీఎం ఆదేశం. – దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. – జువైనల్ హోమ్స్ పర్యవేక్షణకు ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎం ఆదేశం. – జువైనల్ హోమ్స్లో సౌకర్యాల కల్పనపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం. హాజరైన మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి కేవీ. ఉషాశ్రీచరణ్, స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా, శిశుసంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్.అనురాధ, మార్క్ఫెడ్ కమిషనర్ పీఎస్. ప్రద్యుమ్న, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.సిరి, ఇతర ఉన్నతాధికారులు.