నేడు గడపగడపకు మన ప్రభుత్వంపై వర్క్‌షాప్‌ 

క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ 

తాడేప‌ల్లి: రాష్ట్రంలోవైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల జరిగిన మేలును ప్రజలకు వివరించి.. ఆశీస్సులు కోరేందుకు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై శుక్రవారం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యేలు, వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లు తదితరులు పాల్గొంటారు.వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల ప్రతి ఇంటికీ జరిగిన మేలును వివరించడమే లక్ష్యంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆదేశాల మేరకు మే 11న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ప్రారంభించారు.

సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం చేసిన మేలును అక్కాచెల్లెమ్మలకు వివరించడానికి ఇంటింటికి వెళుతున్న ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలకు గడపగడపలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరును సమీక్షించి, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల అభిప్రాయాలను తెలుసుకుని ఆ కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రతినెలా సీఎం వైయ‌స్‌ జగన్‌ వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నారు.  

Back to Top