రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
బూదరాజు సేవలు చిరస్మరణీయం
02 May 2020 1:00 PM
సీఎం వైయస్ జగన్
‘గురు స్మరణలో’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
తాడేపల్లి: ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సీనియర్ పాత్రికేయుడు బూదరాజు రాధాకృష్ణ సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బూదరాజు రాధాకృష్ణ 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య బృందం రూపొందించిన కవితా సంకలనం ‘గురు స్మరణలో’ పుస్తకాన్ని సీఎం జగన్ శనివారం క్యాంప్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆవిష్కరణ చేశారు. పత్రికా రంగానికి, తెలుగు భాషకు బూదరాజు సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి అన్నారు. కార్యక్రమంలో ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కమ్యూనికేషన్స్ సలహాదారు జీవీడీ కృష్ణ మోహన్ పాల్గొన్నారు.
కాగా ‘బూరా బృందం’ గా పిలుచుకునే బూదరాజు శిష్యులు పి.మధుసూదన్, ముని సురేష్ పిళ్ళె, ఎస్.రాము ఈ సంకలనాన్ని అందుబాబులోకి తీసుకువచ్చారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ... కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి తాము హాజరు కాలేకపోయామని తెలిపారు.