రేపు ఢిల్లీకి సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానమంత్రితో చర్చించనున్నారు. 
 

Back to Top