ఢిల్లీకి బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. దేశ రాజధానిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు, పలువురు కేంద్ర మంత్రులను సీఎం వైయస్‌ జగన్‌ కలవనున్నారు. రాత్రి ఢిల్లీలో బస చేసి బుధవారం ఉదయం బయలుదేరి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు. బుధవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. 24వ తేదీ ఉదయం కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మించనున్న భవనానికి జరిగే భూమిపూజలో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొంటారు.    
 

Back to Top