అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న సీఎం వైయస్‌ జగన్, మంత్రి అనిల్‌

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రమంత్రి షెకావత్‌ అధ్యక్షతన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం న్యాయబద్ధంగా నీటిని వాడుకోనున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌ తన వాదన వినిపించనున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట మంత్రి అనిల్‌కుమార్, కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉన్నారు.

Back to Top