తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని ఏపీ క్షత్రియ ఫెడరేషన్ ప్రతినిధుల బృందం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. నూతనంగా ఏర్పాటైన జిల్లాకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రికి క్షత్రియ ఫెడరేషన్ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటుచేసి పేద క్షత్రియులను ఆదుకుంటున్నందుకు వారి తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు సేవాసమితి పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాము ఏపీ క్షత్రియ ఫెడరేషన్ను ఏర్పాటుచేసి మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు సీఎంకి వివరించారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం ఉంటుందని సీఎం వైయస్ జగన్ వారికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఏపీ క్షత్రియ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటపతి రాజు, దాట్ల సత్యనారాయణ రాజు, ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, క్షత్రియ ఫెడరేషన్ వైస్ ఛైర్మన్ టీవీఎస్ ఆంజనేయ రాజు, గాదిరాజు సుబ్బరాజు ఉన్నారు.